కొడిమ్యాల మండలంలో గులాబీ పండుగ
కొడిమ్యాల (నేటి ధాత్రి):
* జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కొడిమ్యాల మండల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు*
*ముఖ్యఅతిథులుగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ , చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ *
సుమారు పదిహేను కిలోమీటర్లు ఉత్సాహంగా సాగిన బైక్ ర్యాలీ
బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపు
1000 మంది బీఆర్ఎస్ పార్టీ లో చేరిక
కొడిమ్యాల సర్పంచ్ ఏలేటి మమత నర్సింహారెడ్డి, పూడూరు ఉపసర్పంచ్ బండా లింగారెడ్డి,రామకిష్టాపూర్, డబ్బు తిమ్మాయపల్లి, చింతలపల్లి, కోనాపూర్,చెప్యాల గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ ని భారీ మెజారిటీతో గెలిపించి మూడో సారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ ని చేయాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కొత్త పథకం ఏది లేదని అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ..
కొడిమ్యాల మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.
పోతారం కాలువ, మైసమ్మ చెరువు కాలువల ఇబ్బందులు తొలగిపోతాయి అన్నారు.
త్వరలోనే నూతనంగా టెండర్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పని చేస్తున్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను మీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాలని చాలెంజ్ విసిరారు.
తెలంగాణలో సంక్షేమంలో స్వర్ణయుగం నడుస్తుంది.
దేశానికి ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సాగుతుంది.
తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో అనేక అవమానాలకు గురైనా మొక్కవోని ధైర్యంతో నాటి ఉద్యమ సారథి నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్లారు.
పరిపాలించడం రాదని వెక్కిరించారు.కరెంట్ వైర్ల పై బట్టలు ఆరేసుకుంటారని అన్నారు.
తొమ్మిది సంవత్సరాల క్రితం అనాథలాంటి తెలంగాణ. నెర్రెలు బారిన బీడు భూముల తెలంగాణ.తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం, ముఖ్యమంత్రి గా కేసీఆర్ గెలవడంతో తెలంగాణ గెలిచి నిలిచింది.
ఎటు చూసినా కాళేశ్వరం నీళ్ళు.ఎర్రటి ఎండాకాలంలో మత్తడి దుంకుతున్న చెరువులు.
ఎటు చూసినా పచ్చిని పంట పొలాలు.బంగారం లాంటి పంటలు.
గతంలో కరెంటు లేక పరిశ్రమలు పవర్ హాలిడే ప్రకటించేవి.
కానీ ఇప్పుడు ఇరువైయి నాలుగు గంటల కరెంటు, వ్యవసాయానికి ఉచితంగా ఇరువైయి నాలుగు గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా,రైతు వేదికల నిర్మాణం.
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో స్మశాన వాటికల నిర్మాణం, డంపింగ్ యార్డ్ ల నిర్మాణం,పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా అసరా పెన్షన్లు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సాగు భూములను ఆన్లైన్ చేసి ఉచితంగా డిజిటల్ పాస్ పుస్తకాలను అందించడం జరిగింది.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ చేసి పాస్ బుక్ లో అరగంటలోనే చేర్చడం జరుగుతుంది.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 1001 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి లక్షా ఇరువైయి వేల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది.
ప్రతి జిల్లా కేంద్రంలో ఉచిత స్టడీ సర్కిల్ లను ఏర్పాటు చేయడం జరిగింది.
జిల్లా కేంద్రాలకు ఐటీ విస్తరణ.
ఎటు చూసినా పచ్చని పంట పొలాలు దర్శనం ఇస్తున్నాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ తొమ్మిది సంవత్సరాలలో కేవలం ఆసరా పెన్షన్లకు డెబ్బయి వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది.
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమత్తుకు 45వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చేందుకు 48వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది.
రైతులకు ఆర్థిక చేయూత అందించేందుకు ఎకరానికి 5వేల రూపాయల చొప్పున ఇప్పటివరకు 72వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేసిన ప్రపంచంలోనే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసి కేవలం మూడు సంవత్సరాలలో పూర్తి చేసి రైతులకు నీళ్ళు అందించడం జరుగుతోంది.
రైతు చనిపోతే రైతు బీమా పథకం ద్వారా రైతులను ఆదుకున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ ప్రభుత్వమే రైతులకు బీమా ప్రీమియం చెల్లిస్తుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసి తో ఒప్పందం చేసుకొని సంవత్సరానికి దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు రైతుల తరపున బీమా ప్రీమియం కడుతుందని తెలిపారు.
రైతుబీమా పథకం ద్వారా రైతు చనిపోయిన కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇస్తుందని తెలిపారు.
మహిళల రక్షణ కోసం షీ టీం లను ఏర్పాటు చేయడం జరిగింది.
గర్భినీ స్ర్తీల కోసం, పుట్టిన పిల్లలకోసం కేసీఆర్ కిట్టు అందజేయడం జరుగుతుంది.
పల్లెల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది.
పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుంది.
పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరితహారం కార్యక్రమం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం ద్వారా పెళ్ళైన పేదింటి ఆడబిడ్డలకు 1,00,116 ఇచ్చి ఇప్పటి వరకు 10వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది.
2014 ముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి ఒక్క లక్ష 116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నాం.
ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పని చేస్తుంది.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆడబిడ్డలకు ఒక భరోసాగా ఉంది.
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదు.
భారతదేశంలో ఆడబిడ్డల పెళ్లిళ్ల కొరకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని కరోనా లాంటి సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికే పెద్ద పీట వేశారు.
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోంది.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలతో పేదలను అక్కున చేర్చుకున్న ప్రభుత్వ కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటే.
ప్రజలకు కావాలసిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన కళ్యాణలక్షీ పథకం ఆడపిల్లకు ఓ వరం లాంటిదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన పథకం ఉండడం ఎంతో గర్వంగా ఉంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో లేకున్నా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రాష్ట్రంలో అమలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. నేటి పరిస్థితులలో ఆడపిల్ల పెళ్లి చేయడానికి, ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలను ఆదుకునేందుకు 25వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం.దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు గొప్ప నిర్ణయం.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం దళిత సాధికారత పథకం.
దళితుల ఆర్థిక ఎదుగుదలకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం దళితబంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు.
దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం దళిత బంధు పథకం పని చేస్తుందని అన్నారు.
సబ్బండ వర్గాలు ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.
దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
గతంలో దళితులను ను ఓట్లు వేసే యంత్రాలుగా పరిగణించే వారని అన్నారు.
కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు.
దళితులు పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది.
ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి దళిత బిడ్డలు చదువుకునేందుకు ప్రభుత్వం తరఫున ప్రతి విద్యార్థి పై లక్షా 25 వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తుంది.
అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ద్వారా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి విదేశాల్లో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది.
దళిత బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ లుగా, సివిల్స్లో ఉద్యోగం సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది.
ఈ తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా దళితులు ఎవరి మీద ఆధారపడకుండా తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవచ్చు.
ఈ పథకం కోసం దళితులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
రైతు బంధు డబ్బుల వలే నేరుగా వారి అకౌంట్ లోనే డబ్బులు జమ.
ఒకరి క్రింద పని చేస్తున్న దళిత యువకులు యజమానులుగా మారడానికి దళిత బంధు పథకం పని చేస్తుంది.
ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్, కొడిమ్యాల జెడ్పిటిసి పొనుగోటి ప్రశాంతి కృష్ణారావు, కొడిమ్యాల ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజనర్సింగరావు, మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, బి ర్ స్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొనడం జరిగింది..