నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
ఫిబ్రవరి 16న నిర్వహించనున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు.బుధవారంచండూరు మండల పరిధిలోని ధోని పాముల, జోగిగూడెం, ఇడికుడ, గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యదర్శులకుసమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి అవలంబిస్తున్నకార్పొరేట్, మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూను కోవాలనికార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేండ్లు పూర్తయిన రైతాంగ,కార్మిక సంఘాల ప్రజా సమస్యలను పరిష్కరించలేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే పోరాడి సాధించినకార్మిక చట్టాలను కుదించి, నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆయన అన్నారు.దేశాన్ని మత ప్రాతిపాదికనచీల్చి మూడోసారిఅధికారంలోకి రావాలని కలలు కంటున్న బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనిఆయన అన్నారు. భారత్ వెలిగిపోతుంది అచ్చే దిన్ ఆయేగా, విశ్వ గురువు ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చిన పేదలకు ఏమి ఒరగలేదని అన్నారు. 2014లోస్వామినాథన్ కమీషన్ సిఫారసుల మేరకు ఎంఎస్ పి మినిమం సపోర్ట్ ప్రైస్ చెల్లిస్తామన్న హామీని బిజెపి ప్రభుత్వంనిలబెట్టుకో లేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకుమద్దతు ధర, పెట్టుబడుల మీద 50 శాతం ఉండేలా చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చివిస్మరించిందని వారు విమర్శించారు.అనేక సంవత్సరాల నుండి కార్మికుల హక్కులను కాలరాస్తూ, లేబర్ కోడ్ లు తీసుకొచ్చి, కార్మికులను కార్పోరేట్ శక్తులకు బానిసలుగా చేసే విధానాన్నితీసుకొచ్చిందని వారు మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూకార్మికులు, వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలనికార్మికులను వారు కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు నాంపల్లి శంకర్, ముంత వెంకటేశ్వర్లు,దాసరి కృష్ణయ్య,వెంకటాచారి, నాగిళ్ల లక్ష్మయ్య, నారపాక యాదయ్య, బిక్షమయ్య, వెంకటయ్య, రమేష్,పుష్పలత,ధనమ్మతదితరులు పాల్గొన్నారు.
