డిసెంబర్ 14 వ తేదిన జాతీయ లోక్ అదాలత్

హనుమకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

తేదీ:07.12.2024 రోజున వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ మరియు హనుమకొండ ప్రధాన న్యాయమూర్తి సిహెచ్.రమేష్ బాబు నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ “గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ:14.12.2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టులలో మరియు నర్సంపేట, పర్కాల మండల కోర్టులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. కనుక కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్సూమర్ ఫోరమ్ కేసులు, ట్రాఫిక్ ఈ-ఛాలన్ కేసులు మరియు ప్రీ- లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరు అయ్యి, తమ తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్దం కావాలని కోరారు.


జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి, రాజీ కుదుర్చుకోవాలని తెలియజేశారు. రాజీపడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలియజేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయుటకు గాను ఇప్పటికే పోలీసు అధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతోనూ, ఎక్సైజ్ శాఖ అధికారులతో, ఇన్సూరెన్స్ అధికారులతోనూ, న్యాయవాదుల తోనూ, బ్యాంకు మరియు చిట్ ఫండ్ మేనేజర్లతో వేరు వేరు సమావేశాలు నిర్వహించి, అధిక కేసుల పరిష్కార దిశగా చర్యలు చేపట్టాం అని తెలిపారు. ఇప్పటివరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ లో గుర్తించబడిన కేసులలో మొత్తం 325 రాజీపడదగు పెండింగ్ కేసులలోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశాం. వీటిలో క్రిమినల్ – 217, ఎన్.ఐ.యాక్ట్ – 07, ఎం.ఎ.సి.టి.- 54, ట్రాఫిక్ ఈ చాలన్-616, మనీ రికవరీ-04, అదర్ సివిల్ -35, మరియు ప్రీ-లిటిగేషన్ ఎలక్ట్రిసిటి కేసులు- 542, బ్యాంక్ కేసులు – 1931, బి.ఎస్.యన్.ఎల్. కేసులు-295 అని తెలిపారు. ఈ కేసులను పరిష్కరించుటకు వరంగల్ జిల్లాలో-07, నర్సంపేట మండల కోర్టులో-01 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.

ఇప్పటివరకు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ లో గుర్తించబడిన కేసులలో మొత్తం 1101 రాజీపడదగు పెండింగ్ కేసులలోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశాం. వీటిలో క్రిమినల్ – 793, ఎన్.ఐ.యాక్ట్ – 94, ఎం.ఎ.సి.టి. – 79, బ్యాంక్ రికవరీ కేసులు 15, వివాహ సంబంధిత – 52, అదర్ సివిల్ కేసులు- 68 మరియు ప్రీ-లిటిగేషన్ బ్యాంక్ కేసులు – 2409, ప్రీ-లిటిగేషన్ బి.ఎస్.యన్.ఎల్. కేసులు- 308. ఈ కేసులను పరిష్కరించుటకు హనుమకొండ జిల్లాలో-07, పర్కాల కోర్టులో- 01 బెంచీలను ఏర్పాటు చేయడము జరిగింది అని తెలిపారు.

రాజీ పడదగు కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను సాయంత్రం 5.00 గంటలలోపు ఏ రోజైనా రాజీ కుదుర్చుకునేలా ప్రీ-లోక్ అదాలత్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రీ-లోక్ అదాలత్ లో ప్రీ- లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ జాతీయ లోక్ అదాలత్, ప్రి-లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైననూ, సందేహాలకైననూ, ఏదేని న్యాయసహాయం కొరకు అయిననూ న్యాయసేవాధికార సంస్థ ను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version