ముత్తారం అభయాంజనేయ స్వామి కి నాగినేని దంపతుల

8 లక్షల వెండి అభరణాలు సమర్పణ

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి కి మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్ మోహన్ రావు దంపతులు
దాదాపు 8 లక్షల పైగ విలువగల వెండి అభరణాలను
అభయాంజనేయ స్వామి కి శ్రీరామనమని రోజున సమర్పించారు. గతంలో స్వామివారికి జగన్మోహన్ రావు వెండి తొడుగు తన సొంత ఖర్చులతో చేయిస్తానని గత సంవత్సరం శ్రీరామనవమి రోజున గ్రామస్తుల ముందు హామీ ఇచ్చిన మాటకు కట్టుబడి, ఈ శ్రీరామనవమి రోజున ఆభరణాలు చేపించి స్వామివారికి అలంకరించి మొక్కు చెల్లించుకున్నారు. దీంతో నాగినేని దంపతులను తాజా మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ లతోపాటు గ్రామస్తులు, ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ తన కుమారుడు విదేశాలలో ఉంటూ తన సొంత గ్రామమైన ముత్తారంలో అభయాంజనేయ స్వామికి ఇచ్చిన మాట తప్పకుండా ఆభరణాలు చేయించాలని చెప్పి, తన సొంత ఖర్చులతో ఆభరణాలు చేయించాడని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version