ముందడుగు క్యాలెండర్ ఆవిష్కరించిన మున్సిపల్ కమీషనర్

పరకాల నేటిధాత్రి
ముందడుగు ఫౌండేషన్ 2024 సంవత్సర నూతన క్యాలెండర్ ను పరకాల మున్సిపాలిటీ కమీషనర్ శేషాంజన్ స్వామి తన కార్యాలయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వరంగల్ రీజనల్ అధ్యక్షుడు సూర రాజేందర్ మరియు ముందడుగు ఫౌండేషన్ సభ్యులచే క్యాలెండర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మరియు ముందడుగు ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం అని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థ లో వివిధ శాఖల పనితీరుపై , లోపాలపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు రాబడుతూ వ్యవస్థ పై చేస్తున్నారని ఇంకా ముందు ముందు అనేక సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయాలని అభిప్రాయ పడ్డారు.
ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వరంగల్ రీజనల్ అధ్యక్షుడు సూర. రాజేందర్,ముందడుగు ఫౌండేషన్ సభ్యులు ఏతరాజు. సాయిరాం,కానుగుల. రవిప్రసాద్ ,చేపురి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version