పరకాల నేటిధాత్రి
పట్టణంలోని 20వవార్డులో ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వరంగల్ వారిచే నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ మున్సిపల్ చైర్మన్ అనిత రామకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలందరూ ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్సలు ఈ హాస్పిటల్ సౌకర్యం కలదని ఈ మెడికల్ క్యాంపులో సర్జికల్ అంకలాజిస్ట్,హిపటో క్యాన్సర్, గ్యాస్ట్రో,ఎంటరాలజీ,లివర్ వ్యాధిల కొరకు వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కౌన్సిలర్ ఏకు రాజు,మాజీ ఎంపీపీ ఎన్కతల్ల రవీందర్,స్పెషలిస్ట్ డాక్టర్లు తిప్పని అవినాష్,మద్ది నారాయన్,తిప్పని సువిత్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొచ్చు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
