ముదిరాజ్ లు దానం చేసే స్థాయికి ఎదగాలి

# మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ

నర్సంపేట,నేటిధాత్రి :

అన్ని దానాలలోకెల్లా అన్నదానమే గొప్పదని పెద్దలు చెప్పిన మాట తీరుగా ముదిరాజ్ లు యాచించే స్థాయి నుండి దానంచేసే స్థాయికి ఎదగాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు.నర్సంపేట పట్టణం సర్వాపురంకు చెందిన జెట్టి మొగిలి ముదిరాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ సందర్భంగా
మెపా నర్సంపేట డివిజన్ కార్యవర్గ సభ్యులు బాధిత కుటుంబానికి 50 కేజీ ల బియ్యం మృతుడి భార్య అనూష కు అందించారు.అనంతరం రాష్ట్ర కార్యదర్శి దండు చిరంజీవి ముదిరాజ్ మాట్లాడుతూ మృతుని పిల్లలు అక్షిత, భవ్యశ్రీ ల విద్యా అవసరాలకి స్థానిక విద్యావేత్త కేఎస్ఆర్ ఎల్లవేళలా సహకారం అందిస్తామని ముందుకు రావడం సంతోషమని అందుకు ఆయన సేవలను కొనియాడారు.ముందుగా మొగిలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ ముదిరాజ్,డివిజన్ అద్యక్షులు పెండ్యాల యాదగిరి ముదిరాజ్,జిల్లా నాయకులు దోని చేరాలు, రాష్ట్ర నాయకులు సింగారపు రామకృష్ణ ముదిరాజ్ నీరటి రాజు ముదిరాజ్,సందీప్ ముదిరాజ్,సతీష్ ముదిరాజ్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version