కూకట్పల్లి,ఏప్రిల్ 17 నేటి ధాత్రి ఇన్చార్జి
కూకట్పల్లి నియోజకవర్గంలో పలు అసోసి యేషన్ సభ్యులు,పలు దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్పల్లి, బాలాజీనగర్, మూసాపేట్,ఫతేనగ ర్,బాలానగర్,ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు,శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముల వారి ఆశీస్సు లు అందరిపై ఉన్నాయని,ప్రతి పండుగ ను ఆనందగా జరుపుకుంటున్నా మని అన్నారు.బాల రామున్ని జనవరి 22న అయోధ్య మందిరంలో ప్రతిష్ఠించుకున్న విషయాన్ని గుర్తు చేశారు.ఈరోజు అయో ధ్య గుడిలో నేరుగా ఆ బాలరాముడి నుదుట మీదకు సూర్య కిరణాలతో సూర్య తిలకం అద్భుతంగా ఉందని
అన్నరు.అనంతరం అన్నప్రసాద కార్యక్ర మంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరిం చారు.ఆ తర్వాత మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్తో కలిసి పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నా రు.ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.