ప్రజా ప్రతినిధిగా ఎంపీటీసీ సేవలు మరువలేనివి.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

ప్రజా ప్రతినిధిగా ఎంపీటీసీ మడక తిరుమల సేవలు సూరారం ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని గ్రామస్తులు అన్నారు. మంగళవారం రోజు ఎంపీటీసీ మడక తిరుమల పదవీకాలం పూర్తి కావడంతో గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అనేక రాజకీయ ప్రజా ప్రతినిధులు తమ సేవలను అందించడం జరిగింది కానీ, ఒక మహిళగా మడక తిరుమల ఎంపీటీసీ పరిధిలోని గ్రామాలకు చేసిన సేవలు, పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో తిరుమల క్రిశీలక పాత్ర పోషించిందని, అనేక ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందిన ప్రజలు తిరుమల సేవలు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు. సన్మాన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అంజలి గ్రామ పెద్దలు పంచాయతీ సిబ్బంది, సూరారం గ్రామ యువకులు పెద్ద మొత్తంలో హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version