రోడ్డు మరియు ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో జరుగుతున్న రోడ్డు పనులను ఎంపీడీవో సత్య నారాయణ గౌడ్ సందర్శించారు. రోడ్డు పనులు వాడుతున్న సామాగ్రి గురించి అడిగి తెలుసుకుని, నాణ్యత లోపం లేకుండా సకాలంలో రోడ్డు పనులు పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం వెంకట్రావు పల్లి గ్రామపంచాయతీలోని దుబ్బపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సందర్శించారు. సరైన కొలతలు పాటించి పనిచేయాలని, వేసవికాలం దృష్టిలో ఉంచుకొని త్వరగా పనులు పూర్తి చేసుకుని వెళ్లాలని సూచించారు. మంచినీరు, నీడ కోసం టెంట్, అత్యవసర సమయాల్లో అవసరమయ్యే ప్రధమ చికిత్స కిట్టు, ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, గ్రామపంచాయతీ సెక్రటరీలు మొదలైనవారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *