చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని నవాబుపేట గ్రామంలో సర్పంచ్ సాయి సుధా రత్నాకర్ రెడ్డి, గౌడ సంఘం అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల జెడ్పిటిసి గొర్రె సాగర్ ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి జై గౌడ జిల్లా అధ్యక్షులు బొమ్మ శంకర్ గౌడ్ , బుర్ర శ్రీధర్ గౌడ్, ఏరుకొండ రాజేందర్ గౌడ్, ముఖ్య అతిథులుగా విచ్చేసి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంగం నాయకులు అనగాని రాజయ్య గౌడ్, మాదారపు రాజ్ కుమార్ గౌడ్, గోపగాని మహేశ్వరి గౌడ్, గోపగాని స్వామి గౌడ్, పొన్నం కొమురయ్య గౌడ్,తదితరులు పాల్గొన్నారు.