ఎంపీ వద్దిరాజు తమిళనాడు పర్యటన

పళని ఆలయాన్ని సందర్శించిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు

సుబ్రమణ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర -విజయలక్మీ దంపతులు

తమిళనాడులో పర్యటిస్తున్న పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ దంపతులు తమిళనాడులోని పళని సుబ్రమణ్యస్వామి (దండయుతస్వామి) ఆలయాన్ని సందర్శించారు.స్టడీ టూర్ లో పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం తమిళనాడులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.సంఘంలో సభ్యునిగా ఉన్న ఎంపీ రవిచంద్ర ఛైర్మన్ రమేష్ విధూరియ,ఇతర సభ్యులతో కలిసి మంగళవారం సుబ్రమణ్యస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వీరికి ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో అపూర్వ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు, వేదపండితులు ఆశీర్వచనాలు పలికి శాలువాతో సత్కరించారు, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ పుణ్య దంపతుల వెంట కుమారుడు వద్దిరాజు ప్రీతమ్ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version