ఎంపీ వద్దిరాజు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారితో కలిసి”లా ఫర్మ్”ఆఫీసు ప్రారంభోత్సవం

Date 16/10/2024
—————————————-


రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన సమీప బంధువు, ప్రముఖ న్యాయవాది బర్మా చక్రపాణికి చెందిన “లా ఫర్మ్”అడ్వొకేట్స్ అండ్ లీగల్ కన్సెల్టెంట్స్ ఆఫీసుకు ప్రారంభోత్సవం చేశారు

ఎంపీ రవిచంద్ర కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారితో కలిసి నగర శివార్లలోని దూలపల్లి (కొంపల్లి) సెయింట్ మార్టిన్స్ కాలేజీ సమీపాన బుధవారం ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు

ఈ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు అన్నలు వద్దిరాజు కిషన్,వద్దిరాజు దేవేందర్,అల్లుళ్లు డాక్టర్ జే.ఎన్.వెంకట్,విజయ్,సమీప బంధువు ఆకుల రాజయ్య తదితరులు హాజరై చక్రపాణి,ఆయన సోదరుడు బర్మా నాగేశ్వరరావులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

అలాగే, కాంగ్రెస్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్, సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి,మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్లు,ప్రముఖ న్యాయవాదులు సీవీఎల్ నర్సింహారావు,చెరుకూరి శేషగిరిరావు,ఊసా రఘు,గుండ్లపల్లి శేషగిరిరావు,కొండూరి వినోద్, ఎంపీ వద్దిరాజు సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్,ముద్దు వినోద్ తదితరులు కార్యక్రమానికి హాజరై చక్రపాణి,ఆయన సోదరుడు నాగేశ్వరరావులకు శుభాకాంక్షలు చెప్పారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version