ఎంపీ వద్దిరాజు మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శన

Date 01/03/2024
—————————————-


రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన సహచర ఎంపీలు కే.ఆర్.సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్,జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వీ.ప్రకాష్ తదితరులతో కలిసి మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజ్) ప్రాజెక్ట్ ను పరిశీలించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై అధికార కాంగ్రెస్ నాయకులు విషం చిమ్ముతున్న నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు గాను బీఆర్ఎస్ మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు పిలుపునిచ్చింది.ఈ మేరకు ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రులు కే.టీ.రామారావు, తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు,వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి,సత్యవతి రాథోడ్,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు,రాజ్యసభలో తన సహచర సభ్యులు దీవకొండ దామోదర్ రావు,లోకసభ సభ్యులు మాలోతు కవిత, పసునూరి దయాకర్ తదితర ప్రముఖులతో కలిసి మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శించారు.అనంతరం అన్నారం (సరస్వతి బ్యారేజ్)వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ వద్దిరాజు పాల్గొన్నారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version