ఎంపీ వద్దిరాజు ప్రత్యేక పూజలు

Date 20/07/2024
—————————————-
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం గాంధీ చౌక్ లో కొలువైన షిర్డీ సాయిబాబా ఆలయాన్ని శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ
భక్తకోటికి గురుపూర్ణిమ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు
ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు,భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మా గాయత్రి గ్రానైట్స్ కంపెనీ పక్షాన లేదా తన ఎంపీ నిధుల నుంచి సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంట.


ఇక్కడ జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్న.
ఈ ఆలయ కమిటీ ఛైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు ఆహ్వానం మేరకు పలుమార్లు సందర్శించి పూజా కార్యక్రమాలకు హాజరైన
తనతో పాటు భక్తులు,వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా మంచి జరగాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతున్ని వేడుకుంటున్న
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర కు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు

ఆలయ కమిటీ ఛైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు,పాలక మండలి సభ్యులు ఎంపీ వద్దిరాజుకు సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించి,జ్ఞాపికను బహుకరించారు

ఎంపీ వద్దిరాజు వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం,యువ నాయకుడు నానబాల హరీష్ తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version