ఇంకా అందని ఇంకుడు గుంతల డబ్బులు

మూడు సంవత్సరాల నుండి లబ్ధిదారుల ఎదురుచూపులు

చందుర్తి, నేటిదాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో 2019 నుండి 2021సంవత్సరంలో ఈజీఎస్ నిధుల నుండి ఇంకుడు గుంతల నిర్మాణం చేశారు, ఇప్పటివరకు ఇంకుడు గుంతల నిర్మాణం చేసిన పైసలు ఇప్పటి వరకు రాలేదు. చందుర్తి మండలం లోని లింగంపేట గ్రామంలో 2019 నుండి 2021 సంవత్సరంలో ఆ గ్రామంలో సుమారు 78 మంది ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. అందులో 26 మందికి అప్పటి నుండి ఇప్పటివరకు ఇంకుడు గుంతల పైసలు రాలే ఒక్క ఇంకుడు గుంత నిర్మాణం చేసుకుంటే ఒక్కో దానికి వచ్చే డబ్బులు 3200 రూపాయలు, దాదాపు 83 వేల రూపాయల పైసలను గ్రామ పంచాయతీకి చెందిన అకౌంట్ లోనే ఉంచారు . దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ఇప్పటివరకు డబ్బులు రాకపోవడంతో ఇంకుడు గుంతలు నిర్మాణం చేపట్టిన వారు గ్రామపంచాయతీకి వెళ్లి కార్యదర్శిని నిలదీశారు. గ్రామపంచాయతీ అకౌంట్లో ₹1,50,000 ఉండడం వాస్తవమేనని, ఇంకుడు గుంతలకు సంబంధించిన లిస్టు రాలేదు , లిస్టు వచ్చిన తర్వాతనే డబ్బులు ఇస్తామని అన్నట్లు బాధితులు తెలిపారు. లింగంపేట గ్రామ ప్రజలు మండల కార్యాలయానికి వచ్చి ఏపీవో రాజయ్యను ఇంకుడు గుంతల పైసల గురించి ఇప్పటివరకు పైసలు ఎందుకు ఇవ్వలేదు అని ఇంకుడు గుంతల బాధితులు వాపోయారు. మేము గ్రామ పంచాయతీకి మూడు సంవత్సరాల క్రితమే డబ్బులు గ్రామ పంచాయతీకి చెందిన అకౌంట్లో జమ చేశామని అన్నారు. ఆ డబ్బుల గురించి నాకు 15 రోజుల క్రితమే తెలిసిందని అన్నారు.
అసలు ఇప్పటివరకు పైసలు ఇవ్వకపోవడం పై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల కిందటే గ్రామపంచాయతీ అకౌంట్లో పడిన డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు, దీని వెనక ఎవరున్నారు, గత పాలకుల నిర్లక్ష్యం వల్లనేనా అని ప్రజలు అనుకుంటున్నారు.

* ఏ పీ ఓ రాజయ్య వివరణ*

ఏపీవో రాజయ్య ను వివరణ కోరగా లింగంపేట కార్యదర్శి నాకు 15 రోజుల క్రితం మాత్రమే ఈ విషయం తెలిపారు. గ్రామపంచాయతీ అకౌంట్లో పడిన డబ్బులు త్వరలోనే అప్పజెప్తామని అన్నారు, ఇందులో 56 మందికి ఎవరి అకౌంట్లో వారికి డబ్బులు జమ చేసి ఇప్పటికీ మూడు సంవత్సరాల అవుతుందని అన్నారు. మిగిలిన 26 మందికి త్వరలోనే అప్పజెప్తామని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version