నర్సంపేట నేటిధాత్రి:
ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి తన సెల్ ఫోను అదే బస్సులో మరిచిపోగా దానిని మానవత్వంతో ఆర్టీసీ డ్రైవర్ బాధితునికి సెల్ ఫోన్ అందజేశారు ఈ సంఘటన నర్సంపేట ఆర్టీసీ డిపో బస్సులో జరిగింది.శనివారం ఉదయం నర్సంపేట డిపో కి చెందిన టీఎస్ 03 జెడ్ 0455 సూపర్ లగ్జరి బస్సు హైదరాబాద్ ఉప్పల్ నుండి హనుమకొండ వచ్చే ట్రిప్పులో హైదరాబాద్ పట్టణానికి చెందిన ఎం. నగేష్ అనే ప్రయాణికుడు తన యొక్క మొబైల్ ఫోన్ సుమారు రూ.32 వేల విలువగలది బస్సులో మర్చిపోయి మధ్యలోనే దిగిపోయాడు. అది గమనించిన బస్సు డ్రైవర్ హరిసింగ్, (స్టాఫ్ నెంబర్ 650842) డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మికి తెలియజేశారు. దీంతో డిపో మేనేజర్ ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్ ను హనుమకొండ బస్టాండులో స్టేషన్ మేనేజర్ ఆధ్వర్యంలో డ్రైవర్ హరిసింగ్ అలాగే అక్కడ డ్యూటీ చేస్తున్న కండక్టర్ హేమలత, కంట్రోలర్ ప్రయాణికుడికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుడు నర్సంపేట డిపో మేనేజర్ అలాగే సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపాడు.అనంతరం డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ డ్రైవర్ హరిసింగ్ ను అభినందించారు