మహబూబ్ నగర్/ నేటిధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని MUDA కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశంలో పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. మన్మోహన్ సింగ్ మరణించిన.. ఆయన చేసిన సంస్కరణలు దేశ అభివృద్ధికి బాటలు వేశాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.