మహబూబ్ నగర్/నేటి ధాత్రి
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సి.డబ్ల్యూ.సి ప్రత్యేక ప్రతినిధి వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు కలిశారు.