కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

కాంగ్రెస్ హయాంలో రైతులకు పెద్దపీట

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

నిజాంపేట: నేటి ధాత్రి

మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సోమవారం నిజాంపేట మండల కేంద్రము లో పర్యటించారు. బచ్చురాజ్ పల్లి, రజక్ పల్లి, కల్వకుంట, కె.వేంకటాపూర్ గ్రామాల్లో సోసిటీ, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మెదక్ జిల్లా వ్యాప్తంగా 478 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సన్న రకం ధాన్యానికి 500 రూ,, బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఆఖరి ధాన్యం వరకు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, పంజా మహేందర్, నసిరుద్దీన్, మారుతి ,లింగం గౌడ్, లక్ష్మా గౌడ్ ,సత్యనారాయణ రెడ్డి, లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ,రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *