క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రేడ్డి

శుభాకాంక్షలు తెలియచేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో సోమవారం ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సిఎస్ఐ చర్చి పాస్టర్ దైవ సందేశాన్ని అందించారు. యేసు క్రీస్తు జననం గురించి ఈ లోకానికి యేసు సర్వ లోకాన్ని వారి యొక్క పాపాలనుండి విడుదల చేసి రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడని ప్రపంచ శాంతి కోసం ప్రజలను రక్షించడానికి క్రీస్తు యేసు కన్యక అయినకు జన్మించినాడని పరిశుద్ధ గ్రంథము నుండి తెలియ పరిచాడని క్రిస్మస్ గురించిన ప్రత్యేక ప్రార్ధనలు చేసి,పాటలు పడుతూ,ఆరాధనలు చేశారు.అనంతరం కేక్ కట్ చేశారు.ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.పరకాల ఎమ్మెల్యే గా మార్పు కోరుతూ ప్రార్దనలు చేయడమేకాక పరకాల ఎమ్మెల్యే గా గెలిపించినందులకు కృతజ్ఞతలు తెలిపారు.క్రైస్తవుల ఆర్థిక సామాజిక అభివృద్ధికి కృషి చేస్తానని మీ సమస్యల పరిష్కారం కోసం పాటు పడతానని హామీ ఇచ్చారు.అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అన్నారు.రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవులకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు.ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేద క్రైస్తవులను ఆదుకొనేందుకు ప్రణాళిక రూపొందించడం జరుగుచున్నది క్రైస్తవులకు ఏళ్ల వేళల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో క్రైస్తవ కుటుంబాలు,సంఘ పెద్దలు, వృద్ధులు,యువకులు,పిల్లలు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version