సాయిబాబా దేవాలయ వార్షికోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో సాయిబాబా దేవాలయ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా ఆలయానికి వచ్చిన రేవూరి ప్రకాష్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అర్చకులు ఆశీర్వచనలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించగా వారు అందించిన తీర్థప్రసాదాలు ఎమ్మెల్యే స్వీకరించారు.ఆలయ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి రోజున సాయిబాబా దేవాలయానికి రావడం ఆనందంగా ఉందని దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సాయిబాబా ఆశీస్సులతో పట్టణ ప్రజలతో పాటు పరకాల నియోజవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించే శక్తిని ప్రసాదించాలని కోరారు.దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version