హైదరాబాద్ :
ఖమ్మం రూరల్ మండలం తెల్దార్ పల్లిలోని నివాసంలో తమ్మినేనికి గుండెపోటు వచ్చింది..హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసు కున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం అక్కడికి చేరుకొని వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు..అనంతరం తమ్మినేని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
