గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే (జీఎంర్ )

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలోని శ్రీ.శ్రీ.శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కురుమూర్తి గుట్ట వద్ద నిర్వహించిన గిరి ప్రదర్శన కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంర్ ), వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, మహబూబ్ నగర్ మాజీ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి. స్వర్ణ సుధాకర్ రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి, కురుమూర్తి దేవస్థాన చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కురుమూర్తి గిరి ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు, గత 70 ఏళ్ల పాలనలో కురుమూర్తి క్షేత్రానికి ఏ ముఖ్యమంత్రి రాలేదని, కురుమూర్తి స్వామి దర్శనానికి వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఎలివేటేడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మించాలని గౌరవ ముఖ్యమంత్రి ని కోరడంతో మన పాలమూరు ముద్దుబిడ్డ కురుమూర్తి క్షేత్రానికి దర్శనానికి రావడంతో పాటు, ఎలివేటేడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి 110 కోట్లు మంజూరు చేసి, కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, అంతేకాక దేవాలయ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపమని తెలియజేయడంతో, భక్తుల సౌకర్యార్థం కళ్యాణమండపం, కాటేజెస్, తదితర అభివృద్ధి పనులు చేపట్టాలంటూ 66 కోట్లతో ప్రతిపాదనలు కలెక్టర్ కి పంపించడం జరిగిందని తెలియజేశారు, కురుమూర్తి గిరి ప్రదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నిర్వాహకులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version