ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం

మొగుళ్ళపల్లి సర్పంచ్ మోటే ధర్మన్న

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 11

ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి గడపగడపకు అందాయని, తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల కులాల వారి అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి ఆశీర్వదించి ముచ్చటగా మూడోసారి సీఎంను చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి మరింత అభివృద్ధి చెందాలంటే మన అభివృద్ధి ప్రదాత భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకనివ్వాలని, కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోతే ప్రజలు అధోగతి పాలు కావాల్సిందేనన్నారు. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీ కావాలో.. మోసపుట్టేత్తుగడలతో మోసం చేసే కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version