గణపురం నేటి ధాత్రి
వెంకటాపూర్ మండలం లోని రామాంజపురం గ్రామ శివారులో కొలువుదీరిన శ్రీ ఎరుకల నాంచారమ్మ తల్లిని గురువారం సాయంత్రం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి దర్శించుకున్నారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎరుకల కులస్తులు ఎమ్మెల్యేకు నాంచరమ్మ తల్లి బుట్టను అందించి ఘన స్వాగతం పలికారు అనంతరం పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ నాంచరమ్మ ఎరుకల కులస్తుల ఆరాధ్యదైవమని ప్రతీ సంవత్సరం మే నెలలో వైశాఖ పౌర్ణమి రోజున జాతర జరుపుకోవడం జరుగుతుందన్నారు నూతన ఆలయ నిర్మాణంతో పాటు జాతరకు వచ్చే రోడ్డు ను తారు రోడ్డును చేయాలని ఎమ్మెల్యే గారిని ఎరుకల కుల పెద్దలు కోరగా మంత్రి సీతక్క గారితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుని ఆలయ అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య డైరెక్టర్ కేతిరి సుభాష్ డైరెక్టర్లు కోనేటి రాజు మనుపాటి రమేష్, అంగిడి ప్రశాంత్ కేతిరి రాజేందర్ కుర్ర రవి తదితరులు ఉన్నారు