క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాగణపురం మండలం సీతారాంపురం గ్రామ పరిధిలో ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూపాలపల్లి ములుగు జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అనంతరం వారు మాట్లాడుతూ క్రీడా పోటీలలో పాల్గొనడం వల్ల స్నేహభావం పెరుగుతుందని క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రతి ఒక్కరిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని అలాంటప్పుడే క్రీడల్లో రాణించగలుగుతారని ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు క్రీడల్లో రాణించే వారిని ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులు గా ఎదిగి ఈ ప్రాంతానికి పేరు తీసుకొస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రామేశ్వరరావు గణపురం పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్ కో ఆప్షన్ సభ్యుడు ఎండి చోటే మియా క్రీడాకారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version