మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు గురువారం రోజున భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి శంకుస్థాపన చేశారు, నర్సింగపూర్,మెట్టుపల్లి,మొట్లపల్లి,ఎల్లారెడ్డి పల్లి,కాసులపాడ్,పిడిసిల్ల, ముల్కలపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన,నరసింగాపూర్ గ్రామంలో రూ.20లక్షలతో నూతన గ్రామపంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.మెట్టుపల్లి గ్రామంలో 30 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీని ప్రారంభించారు అనంతరం గ్రామంలో 20 లక్షలతో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన , మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆదనపు గదులను ప్రారంభించారు.
మోట్లపల్లి గ్రామంలో మహిళలకు ఉచితంగా అందిస్తున్న కుట్టు మిషన్లను మరియు దసరా పండుగ చీరలను కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. గ్రామంలో రూపాయలు 10 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్లకు శంకుస్థాపన .కాసులపాడు గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో కోటి 50 లక్షలతో నిర్మిస్తున్న నుతన బ్రిడ్జి నిర్మాణ పనులు మరియు 9.90లక్షలతో నిర్మించనున్న యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన .పిడిసిల్ల గ్రామంలో రూ. 10లక్షలతో మరియు ములకలపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జోరుకసదయ్య స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు అధికారులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version