ఎన్నికల ప్రచార నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు

గుడాడ్ పల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మండలం గుడాడ్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ గండ్ర జ్యోతి జడ్పీ వైస్ చైర్మన్ కల్లెపు శోభ రఘుపతి రావు, ఎంపీపీ మందల లావణ్య విద్య సాగర్ పర్యటించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.గతంలో ఉండే పాలనకు,నేడు కేసీఆర్ పాలన పట్ల ప్రజలు ఆలోచించాలి.ఎన్నో పోరాటాల నడుమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల్లో సానుకూల స్పందన, పూర్తి విశ్వాసం ఉంది.రైతులకు రైతు బంధు,రైతు భీమా,ఉచితంగా 24గంటల విద్యుత్తు, ఆందుబాటులో ఎరువులు,గిట్టుబాటు ధరలు, కేంద్రం సహకారం ఇవ్వకపోయినా రైతు కేంద్రాలలో వడ్లకోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత.గతంకో 200 ఉన్న ప్రభుత్వ ఆశ్రమ పాటశాలను విద్యారంగాన్ని అభివృద్ధి చర్యలని 1000పై చిలుకు గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం, మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు,లాబ్ రూంలు,విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనం,ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ పథకం ద్వారా ఉదయం అల్పాహారం,కార్పొరేట్ స్థాయి పాఠశాలకు ధీటుగా విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ఉచితంగా బట్టలు అందించిన ప్రభుత్వం.గుడాడ్ పల్లి గ్రామంలో గతంలో ఏ ఎన్నిక జరిగిన బి ఆర్ ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ లభించింది.ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరారు.గుడాడ్ పల్లి గ్రామంలో పార్టీ అభిమాని ఇంట్లో కలిసి భోజనం చేశారు ఎన్నిక ప్రచారం ప్రారంభించిన గండ్ర దంపతులకు ప్రత్యేకంగా సన్మానించి,వస్త్రాలు బహుకరించిన కల్లెపు శోభ రఘుపతి రావు దంపతులు.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ ఉడుత లక్ష్మీ ఐలయ్య,ఎంపీటీసీ పాటురి సంధ్య ఆయా గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీలు,నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version