భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని సర్ధార్ పాపన్న గౌడ్ సెంటర్ లో బడుగు బలహీన వర్గాల చక్రవర్తి, విప్లవ వీరుడు, పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అవిష్కరించారు
ఈ సందర్భంగా
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప పోరాట యోధుడు అని అన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తాం రాష్ట్ర ప్రభుత్వం గౌడకులస్తుల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు.
జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ & గౌడ సంఘాల జిల్లా జేఏసీ చైర్మన్ బుర్ర రమేష్ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు బోనాగాని యాదగిరి గౌడ్, వరంగల్ జేఏసీ కన్వీనర్ చిర్రా రాజు గౌడ్, రాష్ట్ర నాయకులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, జిల్లా జేఏసీ నాయకులు తాటి అశోక్ గౌడ్, బుర్ర కుమారస్వామి గౌడ్, శ్రీపతి ప్రభాకర్ గౌడ్, పులి వేణుగోపాల్ గౌడ్, వేముల మల్లేష్ గౌడ్, కోల రాజమల్లు గౌడ్, బత్తిని శివశంకర్ గౌడ్, ఏరుకొండ గణపతి గౌడ్, మాటూరి రవీందర్ గౌడ్, పబ్బ శ్రీనివాస్ గౌడ్, బుర్ర సదానందం గౌడ్, తాళ్లపల్లి స్వామి గౌడ్, కాసగాని దేవేందర్ గౌడ్, బతిని శ్రీహరి గౌడ్, మోటపోతుల శివ శంకర్ గౌడ్, కంకటి రాజవీరు గౌడ్, నారగాని దేవేందర్ గౌడ్, బొడిగ సదయ్య గౌడ్, బొనాగాని రమేష్ గౌడ్, బండి రమేష్ గౌడ్, మార్క రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు