ప్రారంభమైన మినీ మేడారం జాతర

రిబ్బన్ కట్ చేసి జాతరను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మొగుళ్ల పల్లి నేటి ధాత్రి న్యూస్
మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన నిర్వహించే మినీ మేడారం జాతరను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వనదేవతల ఆశీర్వాదంతో..ఆ తల్లుల దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి..పిల్లాపాపలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆయన వేడుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన జాతరలో కలియ తిరుగుతూ..అందరిని పలకరించారు. ఈ కార్యక్రమంలో మొగుళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ రమేష్ ఎంపీటీసీ ఎర్రబెల్లి వనిత-పున్నం చందర్ రావు, పిడిసిల్ల ఎంపిటిసి దండ వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు, మండల రవీందర్ గౌడ్, చర్లపల్లి శ్రీధర్ గౌడ్, , జాతర నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *