వరి పొలాల్లో వలస కూలీలు..

ఊపందుకున్న వరి నాట్లు

ఏతలకు అడ్వాన్స్ చెల్లించి మరి బుకింగ్ చేస్తున్నా రైతన్నలు

వేములవాడ రూరల్ నేటి ధాత్రి

వేములవాడ రూరల్ ప్రాంతాల్లో
రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతన్నలు పొలంబాట పట్టారు
వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు భూగర్భజలా లపై ఆధారపడి జిల్లాలో వరి సాగుపై ఆశలు పెం చుకున్నారు. విస్తీర్ణం పెరగడంతో కూలీల కొరత ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలే రైతులకు ఆధారంగా మారుతున్నారు. దాదాపు నెల రోజులకు పైగా కాలం గడిచిపోయినా
గ్రామాల్లో గట్టి వర్షాలు కురవనే లేదు. లోటు వర్షపాతమే కొనసాగుతోంది. గ్రామాల్లో కొంత ఆలస్యంగా నాట్లు మొదలైన వేములవాడ రూరల్ లో ఇప్పటి వరకు 10 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. నారుమడులు సిద్ధంగా ఉన్నా కూలీల కొరతతో రైతులు కూలీలా కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నా రైతన్నలు

ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు

రెండు సంవత్సరాలుగా వానాకాలం, యాసంగి సీజన్‌ల సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా.వేములవాడ రురల్ లోని పలు గ్రామాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధిని వెతుక్కుంటూ వరినాట్లకు కూలీలు వలస వస్తున్నారు. వేములవాడ మండలం తో పాటు పలు మండలాల్లో వలస కూలీలు వరినాట్లు వేస్తున్నారు.
రైతులు పత్తిసాగును తగ్గించి వరిసాగును పెంచుకున్నారు. దీంతో కూలీల కొరత ఏర్పడింది. ఇక్కడి మధ్యవర్తులు కొందరు బీహర్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు ఎకరానికి రూ .4500 నుంచి 6500 వరకు వలస కూలీలకు చెల్లిస్తున్నారు. స్థానికంగా ఉండే కూలీలకు కూడా డి మాండ్‌ ఏర్పడింది.
రైతులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలతో నాట్లలో వేగం పెరిగిందని చెప్పుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version