మహేంద ర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినగొట్టి ముక్కుల పద్మారావు
కూకట్పల్లి నేటి ధాత్రి ఇంచార్జ్
మాజీ మంత్రి,ప్రస్తుత శాసనమండలి సభ్యులు,పట్నం మహేందర్ రెడ్డి సోమ వారం రోజు ఉదయం సీనియర్ రాజకీయ నాయకులు గొట్టి ముక్కుల పద్మారావుని మర్యాదపూర్వ కంగా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ ఆహ్వానానికి గొట్టి ముక్కుల పద్మారావు సానుకూలంగా స్పందించి సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా,భేటీలో భాగంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎన్నికల వ్యూహాలు,జరుగుతున్న పరిణామాలపై సుధీర్ఘంగా చర్చకు వచ్చాయి.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షు లు శేరి సతీష్ రెడ్డి,సీనియర్ నాయకులు కొప్పిశెట్టి దినేష్,మేకల మైఖేల్,మహిళా నాయకురాలు దుర్గారాణి,పలువురు నాయకు లు,కార్యకర్తలు తదితరులు పాల్గొ న్నారు.