మెగా లోక్ అదాలత్ రణం కంటే రాజీ నయం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలోఈ నెల 28 వ తేదీన నిర్వహించే మెగాలోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మొగుళ్ళపల్లి మండల పారా లీగల్ వాలంటీర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రజలను ఉద్దేంచి మాట్లాడుతూ రాజీ పడదగిన కేసులు,సివిల్ మరియు క్రిమినల్ కేసులు మరియు ఎక్సైజ్,భార్య భర్తల కేసులు యాక్సిడెంట్ కేసుల్లో లోక్ అదాలత్ ద్వారా కాలయాపన కాకుండా సత్వర న్యాయం అందించడం జరుగుతుందని, ప్రజల అందరు ద్వేష భావాలను తగ్గించుకుని, కేసుల్లో రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని, రణం కంటే రాజీనయం అని తద్వారా విలువైన సమయం, డబ్బు ఆదా అవుతుందని అన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వాడుకుని పెద్ద సంఖ్యలో కేసులు రాజీ చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోమొగుళ్ళపల్లి మండలంలోని ప్రజలు పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version