నేడు జనగామలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సమావేశం.

నర్సంపేట,నేటిధాత్రి:

నేడు జనగాం జిల్లాలో జరుగు ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ బీసీ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నర్సంపేట డిపో నాయకులు గొలనకొండ వేణు గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సమావేశానికి ఆర్టీసీ తెలంగాణ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ. నిరంజన్ ముఖ్య అతిథిగా, వరంగల్ రీజినల్ సెక్రెటరీ సాంబయ్య విచ్చేసి ప్రసంగిస్తారని అన్నారు. కావున వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన 9 డిపోల ఆర్టీసీ బీసీ ఉద్యోగులు సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశం జనగామ పట్టణంలోని విజయ మినీ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని వేణు పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version