మహబూబ్ నగర్ జిల్లా బిజెపి కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశం శనివారం రోజు పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా కొంగలి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ బీజేపీ
జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ మోర్చా ఇంచార్జ్ గోవర్ధన్ జి , కేంద్ర డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామ గ్రామాన దళిత సమ్మేలాలను ఏర్పాటు చేస్తూ బిజెపి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేసి రాబోయే రోజుల్లో నియోజకవర్గస్థాయిలో దళిత సమ్మేళనాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు దళిత సంఘ నాయకులు బిజెపి ఎస్సీ మోర్చా సర్పంచ్ లు వార్డ్ మెంబర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు..

ఈ కార్యక్రమంలో డాక్టర్. కొంగళి శ్రీకాంత్ అడ్వకేట్ బీజేపీ ఎస్సీ మోర్చా పాలమూరు జిల్లా ప్రెసిడెంట్
పాలమూరు పార్లమెంట్ ఎస్సీ మోర్చా ఇంచార్జ్, ఎస్సీ మోర్చా పాలమూరు పార్లమెంట్ సహా ఇన్చార్జ్ ఎడ్ల కృష్ణయ్య ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండన్న ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, మిట్టమీది నాగరాజు జిల్లా ఉపాధ్యక్షులు, రాము ఎస్సీ మోర్చా సింగిల్ విండో డైరెక్టర్, చిన్నప్ప ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు రిటైర్డ్ పోలీస్ ఎస్ఏ మోర్చా కార్యదర్శి ముక్కుని స్వామి రేపు జరగబోయే అంబేద్కర్ జయంతికి ప్రతి ఒక్క బీజేపీ దళిత నాయకులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version