కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

నేను మీ సేవకుడిని

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నాంపల్లి శ్రీను జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ లోకి చేరికలు

#నెక్కొండ, నేటి ధాత్రి: రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ గాలి విస్తుందని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సోమవారం భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి
అన్నారు. నెక్కొండ మండలంలోని నాగారం సీనియర్ నాయకుడు నాంపల్లి శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో నాగారం గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీ కీ చెందిన 25 కుటుంబాలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీటీసీ బిక్షం ,తదితరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి వారీని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆహ్వానించారు.అలాగే చంద్రుగొండ గ్రామంలో పలు పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరారు. ఈ సందర్భంగా చంద్రుగొండ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ పది సంవత్సరాలు పందికొక్కుల ప్రజల ఆస్తులు, దోచుకుని తిన్న గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ప్రజలు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఇక ఆ పార్టీ కనుమరుగు కానున్నదని ఆయన జోషించి చెప్పారు భారత రాష్ట్ర సమితిలో చేసిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీసి ప్రజలకు వివరిస్తామని ఎందుకోసం కార్యకర్తలు అందరూ సైనికుల పని చేయాలని ఆయన అన్నారు .కార్యక్రమంలో టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ,మండల పార్టీ ,పట్టణ పార్టీ అధ్యక్షుడు అశోక్, పెండ్యాల హరిప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శివకుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి , రామలింగేశ్వర ఆలయ చైర్మన్ కొమ్మ రెడ్డి సుధాకర్ రెడ్డి , కొల్లి సుబ్బారెడ్డి ,కుసుమ చెన్నకేశవులు , చంద్రుగొండ గ్రామ పార్టీ అధ్యక్షుడు అనిల్, తమ్మిశెట్టి సాంబయ్య, బక్కి నరేష్, వడ్డే సురేష్, దాసరి సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version