బిఆర్ఎస్ పార్టీ కి నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు.

పార్లమెంట్ అభ్యర్థి గెలుపే
లక్ష్యంగా పనిచేయండి.

హసన్ పర్తి /నేటి ధాత్రి

వర్థన్నపేట నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో వర్థన్నపేటనియోజవర్గంలో బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి ,మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి , ఆధ్వర్యంలో నాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బండారి స్వర్ణలత మరియు మాజీ ఉపసర్పంచ్ బండారి సాంబయ్య, తోట రవి బండారి రాజయ్య బండారి భీమయ్య గడ్డం రాజారాం బండారి శ్రీకాంత్ తో సుమారు 50 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు.ఈ సందర్బంగా వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం, బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొన్నటి ఎన్నికల వరకు ప్రజలను మోస పూరిత మాటలతో మభ్యపెడుతూ కాలం వెల్లదీశారని అన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ నాయకులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాపాలన సాధ్యమని తెలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాత కొత్త అనే విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గారిని భారీ మెజారితో గెలిపించి వరంగల్ గడ్డ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి అని వారు కోరారు…
ఈ ఆహ్వాన కార్యక్రమం లో హాసన్ పర్తి మండల బీసీ సెల్ అధ్యక్షులు నక్క రవి ,గ్రామ అధ్యకులు గౌరు రాజీ రెడ్డి, కుమార్, అనిల్ ,బద్రి ,సాంబ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version