రామారావు పల్లి మిత్ర బృందం ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ

ముఖ్య అతిథులుగా బిజెపి నాయకులు వికాస్ రావు, దీప దంపతులు.
చందుర్తి, నేటిధాత్రి:

ఈరోజు అయోధ్యలో శ్రీరాముని ఆలయ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రామారావు పల్లి గ్రామంలో అన్నదాన కార్యక్రమం తో పాటు కబడ్డీ మండల స్థాయి టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ నిర్వాహకులు-
నల్ల మహిపాల్ రెడ్డి- జాతీయ కబడ్డీ క్రీడాకారుడు
అయల్నేని కమలాకర్ రావు – సర్పంచ్
ఆది రవీందర్ -మాజీ సర్పంచ్
గొజుగారి సంజీవ్, మెంగలి కోటయ్య, నరాకుల గంగ స్వామి, ఆది శ్రీనివాస్, గడ్డం వెంకటేశం, నాయిని నాగరాజు లు కలిసి నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో జోగాపూర్ ప్రైమరీ స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ బోరుగయ తిరుపతి,శేవాల భక్తర్, కిష్టంపేట మాజీ ఎంపీటీసీ మెకినపెళ్లి దేవరాజు, గ్రామ పెద్దలు ఎల్లాల నర్సిరెడ్డి, రామ్రెడ్డి గణేష్, పెద్దిగారి మహేష్, గ్రామ ప్రజలు మరియు క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కబడ్డీ క్రీడలో మొదటి బహుమతితొ పాటుగా 3000/- నగదు బహుమతి కిష్టంపేట గ్రామం గెలుపొందింది
రెండవ బహుమతితొ పాటుగా 2000/- నగదు బహుమతి మల్యాల గ్రామం గెలుపొందింది. వీటితోపాటుగా క్రీడాకారులు అందరికీ వ్యక్తిగత షీల్డ్ లను
గెలుపొందిన క్రీడాకారులకు బిజెపి నాయకులు వికాస్ రావు దీప దంపతులు బహుమతి ప్రధానోత్సవం చేశారు.
ఈ కార్యక్రమానికి ఆయన మొత్తం ఖర్చును నల్ల మహిపాల్ రెడ్డి గారు అందించడం జరిగింది. వారికి క్రీడాకారులు మరియు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *