మండల బాలల పరిరక్షణ కమిటీ శిక్షణ కార్యక్రమం

ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

మంగళవారం కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సమగ్ర బాలల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో హుజురాబాద్ సిడిపిఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఇల్లందకుంట మండల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మండల బాలల పరిరక్షణ కమిటీ కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సరిగొమ్ముల పావని-వెంకటేష్ మాట్లాడుతూ, బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటు, విధి-విధానాలు, బాలల హక్కుల పరిరక్షణ, బాలల చట్టాలు, బాల కార్మిక, బాల్యవివాహాల నిర్మూలన, లైంగిక వేధింపులు, బ్రూణ హత్యలు నిర్మూలన, విద్యాహక్కు చట్టం పలు రకాల చట్టాల పైన ముఖ్యంగా గ్రామ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్త, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వివిధ గ్రామ స్థాయి అధికారులు అవగాహనా కలిగి ఉండాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం అందరు సహకరించాలన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి ఏదైనా సమస్య వస్తే తమ దృష్టికి గాని పోలీసువారి 100కి కానీ.. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఉచిత నెంబర్ కు సమాచార ఇవ్వగలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాణి, ఎంపీడీవో శంకర్, సిడిపిఓ భాగ్యలక్ష్మి, బాలల పరిరక్షణ అధికారి రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సూపర్వైజర్ దూడం కుమారస్వామి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, ఏపిఎం రమాదేవి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తులసిదాస్, హెడ్ కానిస్టేబుల్, పూజారులు, పాస్టర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version