ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్యాల స్వామి
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం భూపాలపల్లి నియోజకవర్గ అధ్యక్షులు కూరాకుల చిన్న మల్లయ్య రేగొండ మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనారు అనంతరం జిల్లా అధ్యక్షులు దుగ్యాల స్వామి మాట్లాడుతూ ఫిబ్రవరి 7నా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ వేల గొంతులు లక్ష డప్పులు మహాసభకు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర నాయకత్వం మేరకు భూపాలపల్లి ఎరుకలి సంఘం జిల్లా కమిటీ తరఫున మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం మందకృష్ణ మాదిగ ఉద్యమ స్ఫూర్తితో మా జిల్లా నాయకులు మండల నాయకులకు గ్రామ కమిటీ నాయకులు అందరూ కూడా ఫిబ్రవరి 7న వెయ్యి గొంతులు లక్ష డప్పుల మహాసభకు తరలి రావాలని మా జిల్లా కమిటీ తరఫున అందరికీ పిలుపునిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ అధ్యక్షులు కూరాకుల చిన్న మల్లయ్య. జిల్లా ప్రధాన కార్యదర్శి కేతిరి సదానందం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్యాల రాజశేఖర్ చిట్యాల నూతన కమిటీ అధ్యక్షులు దుగ్యాల సురేష్ తదితరులు పాల్గొన్నారు