మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ని దర్శించుకున్న జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి

కొనరావుపేట, నేటి దాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి జాతరను ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేసిన జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి. అనంతరం అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలను అందించారు.

ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ మాట్లాడుతూ మాఘ అమావాస్య సందర్భoగా ప్రతి సంవత్సరం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయం లో జాతర మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా టాయిలెట్స్, పందిర్లు, తాగునీరు సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి భగవంతునినీ దర్శించుకుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో విజయ్ ప్రకాష్ రావు, మాజీ సర్పంచు కొక్కుల భారత నర్సయ్య, శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం సుపెరిండేoట్ శ్రీరాములు, గోలి శ్రీనివాస్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version