నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్న దొంతి, సొంటి రెడ్డి
కంటతడి పెట్టుకున్న రెడ్లవాడ గ్రామ ప్రజలు
#నెక్కొండ ,నేటి ధాత్రి: చిన్ననాటి నుండి కాంగ్రెస్ పార్టీపై అమితమైన ప్రేమతో అంచల్ అంచెలుగా ఎదిగి నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న దూదిమెట్ల మల్లిక్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం కిమ్స్ ఆస్పత్రిలో తుది శ్వాసను విడిచారు. విషయం తెలుసుకున్న ఏఐసిసి సభ్యుడు దొంతి మాధవరెడ్డి మరియు టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మల్లిక్ యాదవ్ భౌతికకాయాన్ని సందర్శించి మృతదేవం పై పార్టీ జెండాను కప్పి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నర్సంపేట మాజీ శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మల్లిక్ యాదవ్ మృతి పార్టీకి తీరని లోటుని నిత్యం ప్రజా సమస్యల పైన పోరాడిన నాయకుడు మల్లిక్ యాదవ్ అన్నారు. మల్లిక్ యాదవ్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. అనంతరం మల్లిక్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నప్పటి పార్వతమ్మ, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమల నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండి శివకుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రామారావు శిరీష, నెక్కొండ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తాడిపత్రి నాగేంద్రమ్మ, కాంగ్రెస్ నాయకులు సాయి కృష్ణ, సింగం ప్రశాంత్, బానోతు శంకర్, నైజాం, రావుల మైపాల్ రెడ్డి, బోడ ప్రవీణ్ నాయక్, దిలీప్, శ్రీకాంత్, ఎడ్ల కిష్టయ్య, రెడ్లవాడ ఎంపిటిసి రవి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొన్నారు.