వచ్చే నెలలో నిర్వహించే నియోజకవర్గ పాదయాత్రను విజయవంతం చేయండి

జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపెళ్లి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ ప్రతి బూత్ లో రెండు వందలకు పైగా సభ్యత్వాలు నమోదు చేయాలని, పూర్తి కానీ బూత్ లలో రెండు రోజుల్లో పూర్తి చేయాలని, క్రియశీలా సభ్యత్వానికి అర్హులైన ప్రతి ఒక్కరు క్రియశీలా సభ్యత్వానికి నమోదు చేసుకొని మండల, జిల్లా పార్టీకి రసీదు పంపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, దానిపై ప్రజా సేకరణ అభిప్రాయంలో భాగంగా డిసెంబర్ ఒకటో తేదీ నుండి ఐదవ తేదీ వరకు జరిగే నియోజకవర్గ పాదయాత్రని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనాలని తెలియజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు అంబటి నర్సింగరావు, కారుపాకల అంజిబాబు, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రామ్, మండల కార్యదర్శి గుంట అశోక్, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల ఐటి సెల్ కన్వీనర్ మాడిశెట్టి జయంత్, కోకన్వీనర్ మూల వంశీ, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఊకంటి మహేందర్ రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, మునిగంటి శ్రీనివాస్ చారి, బుర్ర శ్రీధర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version