కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఫిట్ కార్యదర్శి హరి రామకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఈనెల 5 న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని సింగరేణి కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, సిహెచ్పి ఫిట్ కార్యదర్శి హరి రామకృష్ణ కోరారు. మంగళవారం మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సిహెచ్పి లో ఏఐటీయుసి ఫిట్ కార్యదర్శి హరి రామకృష్ణ ఆధ్వర్యంలో ద్వార సమావేశం ఏర్పాటు చేశారు.ద్వార సమావేశానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. సింగరేణి గనులను వేలంలో పెట్టడం దురదృష్టకరమని అందుకు నిరసనగా జిల్లా కార్యాలయం ముట్టడి చేయాలని కార్మికులకు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. దశలవారీగా జిఎం కార్యాలయాల ముందు నిర్వహించబోయే నిరాహారదీక్ష కార్యక్రమాలను సైతం విజయవంతం చేయాలని కార్మికులను కోరడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రావు, కృష్ణ స్వామి, ప్రజ్యోతి, భాస్కర్, కిషోర్, తిరుపతి, ప్రవీణ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version