బడుగు బలహీన వర్గాలకు భరోసా నిచ్చేది కాంగ్రెస్ పార్టీయే
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ
మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం
మాజీ జడ్పీటీసీ జగన్ మోహన్ రావు
ముత్తారం :- నేటి ధాత్రి
ఐటి శాఖ మంత్రి దుద్ధిల్లశ్రీధర్ బాబు ఆదేశాల మేరకు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు ముత్తారం మండల లోని మైదంబండ పోతారం గ్రామాలలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
బడుగు బలహీనవర్గాలకు భరోసా నిచ్చేది కాంగ్రెస్ పార్టీ యే
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹400 రూపాయలకు పెంపుదల ఉంటుందని
ఎన్నికలు కోడ్ తరువాత 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం జరుగుతుందనీ అన్నారు.
సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 5 న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగింది
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పంటకు కనీస మద్దతు ధర
ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా 1 లక్ష రూపాయలు, ఆరోగ్య బీమా 25 లక్షలు, యువతకు 30 లక్షల ఉద్యోగాలు కలిపించడం జరుగుతుందనీ అన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 న్యాయ గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు
ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. యూత్ నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు