భద్రాచలం నేటి ధాత్రి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి – రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ మరియు జిల్లా డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య
ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం మండలాల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం లో ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ పోదెం వీరయ్య పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ బలరాం నాయక్ ఎంపీ గా,కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి రోడ్ సౌకర్యం మరియు ఆస్పత్రిల నిర్మాణం, కొత్త గ్యాస్ కనెక్షన్లు, వెనుకబడిన ఈ ఏజెన్సీ ప్రాంతానికి అభివృద్ధి పథంలో నడిపించిన బలరాం నాయక్ ని మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని వీరయ్య పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ,పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ దుర్గ ప్రసాద్,సీనియర్ నాయకులు చింతిరియాల రవి,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ,మోహన్ రావు,మండల పార్టీ అధ్యక్షులు జానర్జన్,హుస్సేన్,బ్లాక్, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరైనారు