మాదిగల విశ్వరూప మహాపాదయాత్ర గోడపత్రిక ఆవిష్కరణ.

మహబూబ్ నగర్ జిల్లా ;నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో గురువారం రోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదిగల విశ్వరూప మహా పాదయాత్రకు సంబందించిన. ఉమ్మడి బాలానగర్ మండల్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జి నరిగె యాదయ్య మాదిగ. ఆధ్వర్యంలో గోడపత్రికల ఆవిష్కరణ..
ముఖ్య అతిథి:
బచ్చళ్ల వినోద్ కుమార్ మాదిగ
ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహబూబ్ నగర్ జిల్లా . ఈనెల ఏడవ తారీఖు నుండి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ. ఆధ్వర్యంలో అలంపూర్ నుంచి ప్రారంభమయ్యే మాదిగల విశ్వరూప మహా పాదయాత్రకు ఉమ్మడి బాలానగర్ మండలంలోని అన్ని గ్రామాల నుండి మాదిగ మరియు ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క పాదయాత్ర దాదాపు నెల రోజుల పాటు అన్ని గ్రామాల ప్రజలను చైతన్యం చేసుకుంటూ హైదరాబాద్ వరకు కొనసాగుతుందని తెలిపారు. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుంటే బిజెపి ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమై హైదరాబాదులో లక్షలాది మందితో మాదిగల విశ్వరూపం మహాసభను ఏర్పాటు చేసి మాదిగ మరియు ఉప కులాల సత్తా చూపిస్తామని బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు….
ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పిఎస్ ఉమ్మడి బాలానగర్ ఇంచార్జి నరిగే యాదయ్య మాదిగ,
ఎమ్మార్పిఎస్ సీనియర్ నాయకులు పెరుమాళ్ళ జంగయ్య,సూరారం యాదయ్య,ఆరేళ్ళ యాదయ్య,పోలేపల్లి యాదయ్య, వేపూరి నర్సిములు,మొల్గర చంద్రయ్య, నర్సిములు,కల్లేపల్లి రవి,మొల్గర కృష్ణయ్య,పెద్దోని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version