8వ రోజు కొనసాగుతున్న లారీ ఓనర్స్ సమ్మె

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలో భూపాలపల్లి,గణపురం మండలాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ రోజు సమ్మె కొనసాగుతుంది.డీజిల్,మెంటనేన్స్ ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, ఫైనాన్స్ కిస్తీలు కట్టలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.లారీల నిర్వహణ భారం పెరగడం, కిస్తీలు కట్టలేక అప్పుల బాధతో పలువు యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు.పెరిగిన ఖర్చులు దృష్టిలో పెట్టుకొని కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు టన్ను బొగ్గు కు రు.300,బ్రిక్స్ కు రు.400 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెంచేవరకు సమ్మె విరమించేది లేదని,ఆందోళన ఉదృతం చేసి సింగరేణి జిఎం కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.సమ్మె కారణంగా ఒక వేయి లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బొగ్గు రవాణా ఆగిపోయింది


ఈ కార్యక్రమంలో
భూపాలపల్లి లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల చంద్రయ్య.
ప్రధాన కార్యదర్శి అన్వర్ పాషా.గణపురం లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్గారావు.గౌరవాధ్యక్షులు శ్రీరాములు.
టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట రవి. , కావటం సురేందర్, ఎనగంటి రమేష్, తిరుపతిరావు, రొడ్డ రవి, బాల్ చందు నాయక్.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version