లారీ బైకు డి ఒకరి పరిస్థితి విషమం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామ ప్రభుత్వ పాఠశాల వద్ద లారీ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరోకరి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి వస్తున్న లారీ గుండి గ్రామ ప్రభుత్వ పాఠశాల వద్ద గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఎగోలపు మల్లేశం, భారతి దంపతులు ద్విచక్ర వాహనపై కరీంనగర్ వైపు వెళ్తుండగా ఒకదానిని ఒకటి ఎదురుగా ఢీకొనగా ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా ఎగోలపు భారతికి తలకు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన భారతిని ప్రైవేట్ వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా భర్త మల్లేశంను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తరలించినట్టు సంఘటన స్థలంలోని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈప్రమాదం జరిగిన ప్రదేశంకు పోలీసులు వెళ్లి వివరాలు సేకరించినట్లు సమాచారం తెలియవచ్చింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version